Sunday, 13 September 2026 03:45:02 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో

Date : 01 March 2026 08:27 AM Views : 323

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో కలకలం రేపిన దొంగ నోట్ల చెలామణి దందా ముఠా వివరాలను శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వెల్లడించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల పెట్రోల్ బంక్ లో బుధవారం స్విఫ్ట్ కార్ లో వచ్చిన కానుగంటి క్రాంతికుమార్ అనే వ్యక్తి రూ. 1500 ల పెట్రోల్ పోయించుకుని వెళ్లగా, అవి దొంగ నోట్లని గుర్తించిన బంక్ సిబ్బంది పెట్రోల్ బంక్ ఓనర్ కు తెలుపగా, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ దొంగ నోట్ల చెలామణిలో ఏ1గా ఉన్నటువంటి కానుగంటి క్రాంతి కుమార్,రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఇటిక్యాలనివాసి. ఇతను ఏ 2 గడికొప్పుల రవీందర్ ఆటో డ్రైవర్, లక్షేట్టిపేట ఏ 3 తాండ్ర ప్రకాష్, ఆర్కె 6 శ్రీరాంపూర్, ఏ 4 కొంక మధుకర్, వెంకట్రావ్ పేట్, ఏ 5 సుంకే సురేష్, గోదావరిఖని, ఏ 6 కామిని అనిల్, పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ నుంచి దొంగ నోట్లు తెచ్చి చెలామణి చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. కాకినాడకు చెందిన రాము, రవిల నుంచి నకిలీ కరెన్సీ రూ. 5,98,500తెచ్చి చెలామణి చేయడానికి ప్రయత్నించే క్రమంలో స్థానిక పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఏ7 రాం నాయక్, బెంగులూరు బేకరీ, లక్షేట్టిపేట,ఏ8 నాగునూరి రాము, మోదేలా, లక్షేట్టిపేట, ఏ9 దేవబోయిన సంపత్, బెజ్జంకి, సిద్దిపేట జిల్లా,ఏ10 కడమండ్ల తిరుపతి, జెండా వెంకటాపూర్, ఏ11 గోళ్ళ కుమారస్వామి, పెర్కపల్లి, పెద్దపల్లి జిల్లా,ఏ12 బండారి సత్యనారాయణ,రంగపేట, లక్షేట్టిపేటకు చెందిన వారని ఏసీపీ తెలిపారు. కాగా ఏ 13 రాము, ఏ 14 రవి లు ఇద్దరూ పరారీ లో ఉన్నారని వివరించారు. కాకినాడ నుంచి జరుగుతున్న నోట్ల రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టి విచారణ చేస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు. నకిలీ కరెన్సీ రూ. 5,98,500లతో పాటు నిందితులు వాడిన 3 కార్లు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు, ప్రజలు ఈ దొంగ నోట్ల చెలామణి జరుగుతున్న క్రమంలో అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కోరారు. కేసును చాకచక్యంగా చేధించిన సీఐ రమణ మూర్తి, ఎస్సై లు గోపతి సురేష్, తాజుద్దీన్ సిబ్బందిని ఏసీపీ ప్రకాష్ అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :