ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి/రామగిరి : తెలంగాణ ఉద్యమకారుల పోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పన్నూరు గ్రామ సర్పంచిగా ఇటీవల ఎన్నికైన చిందం మహేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లపై వినతి పత్రం అందజేశారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారులు సర్పంచ్ మహేష్ ను శాలువతో సత్కరించి తమ డిమాండ్ల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర మహిళ విభాగం అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి, తెలంగాణ తొలి మలి చివరి దశ ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నూనె రాజేశం, ఉత్తర తెలంగాణ కన్వీనర్ బత్తుల శంకర్, వనం శేషగిరిరావు, బొల్లవరం భాస్కరరావు, సిరిమల్ల తిరుమల్, బందెల సారంగపాణి, ఉడుత శంకర్, తనుకుట్ల బానేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News