ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రెండో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిగా టికెట్ కేటాయించి బీ ఫామ్ ఇవ్వాలని నరేష్, సురేష్ అన్నదమ్ములు, వార్డ్ పెద్దమనుషుల సమీక్షంలో టికెట్ కావాలని అడిగినప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ అనిత రాంబాబు కి ఇవ్వడం జరుగుతుందని, సురేష్ కి రాజకీయ భవిష్యత్తు ఉంది కావున ఇతర అవకాశాలు ఉంటే చూస్తానని మర్యాదపూర్వకంగా మాత్రమే చెప్పడం జరిగిందని, ఎవరిపై చేయి చేసుకోలేదన్నారు. కేవలం రాజకీయ కక్షపూరితంగానే విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వంటి కొమ్ము యుగంధర్ రెడ్డి, నూకల అభినవ్ రెడ్డి, మండల అధ్యక్షులు రఘువీరారెడ్డి, పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్, జిల్లా కార్యదర్శి గుగులోతు రవి నాయక్, రెండో వార్డ్ కాంగ్రెస్ నాయకులు ఛత్రు నాయక్, కాంగ్రెస్ మండల నాయకులు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News