ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తూ గురువారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి. శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు తమ విద్యను కొనసాగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి చేయడం వల్ల విద్యార్థులు మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల ఉన్నత విద్య ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న అన్ని ఫీజు బకాయిలను విడుదల చేయాలన్నారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఆందోళనలు చేపడతారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఉపకార వేతనాలను సకాలంలో విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం విడుదల చేసే విధానాన్ని అమలు చేయాలి.విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎయు జిల్లా ఉపాధ్యక్షులు కే. కార్తీక్,అజయ్, శివ, రాజు తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News