Tuesday, 28 July 2026 09:32:11 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మావోయిస్టులు ప్రజా క్షేత్రంలో కలవండి..!మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తాం...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Date : 08 March 2026 01:03 AM Views : 187

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మావోయిస్టులు అజ్ఞాతవాన్ని వీడి ప్రజాసేత్రంలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. శనివారం తెలంగాణ సీఎం.రేవంత్ రెడ్డి సమక్షంలో 124 మంది గెరిల్లా ఆర్మీ సభ్యులులొంగిపోయారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోవాలని అతడికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా భద్రతఅన్ని రకాల సేవలుఅందిస్తామన్నారు. చరిత్రలో ఇదే ఇంత పెద్ద లొంగుబాటనే తెలిపారు. మావోయిస్టులు లొంగుబాటుకుకృషిచేసిన అధికారులను ప్రశంసించారు. తుపాకులతో సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మావోయిస్టులు ఆయుధాలు అప్పజెప్పారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకోవడం వల్ల లాభం లేదని సమాజంలో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. మావోయిస్టుల్లో కూడా మంచి విద్యావంతులు ఉన్నారని వారికి రాజకీయాల్లోకి రావాలని కోరిక ఉంటే ఆహ్వానిస్తున్నామన్నారు. మీరు కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు. లొంగిపోయిన వారందరికీపునరావాసం కల్పిస్తామని అలాగే ఇంకా మావోయిస్టులు అందరు కూడా వచ్చి లొంగిపోవాలని సూచించారు. లొంగిపోయిన ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది ఉన్నారు. 124 తుపాకులను పోలీసులకుఅప్పగించిన లొంగిపోయిన మావోయిస్టులు...

ఒక INSAS LMG రైఫిల్, (31) AK-47 రైఫిళ్లు, (21) INSAS రైఫిళ్లు, (20) SLR రైఫిళ్లు, (18) 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులనుపోలీసులకు అప్పగించి మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులు మొత్తం లొంగి పోయారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇంకా కేవలం ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి డిజిపి శివధర్ రెడ్డి డిఐజి సుమతిలను అభినందించారు. అనంతరం డిజిపి శివధర్ రెడ్డి మావోయిస్టులకు వారి పేరిట ఉన్న చెక్కులను పంపిణీ చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :