ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ సింగ్, మండల పంచాయతీ అధికారి సప్దర్ అలీ లతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. అనంతరం తరగతి గదులు,వంటశాల, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, ఇంటర్మీడియట్ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మధ్యాహ్నం భోజనంలో పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందని,ఈ క్రమంలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యా బోధన అందిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని,తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.తెలంగాణ ఆదర్శ పాఠశాల - కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సందర్శించి ల్యాబ్, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించి అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించి విద్యా బోధన చేయాలని తెలిపారు. మండలంలోని రేగులగుంట, మల్కపెల్లి గ్రామాలలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలను సందర్శించి వంటశాలలు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా బోధన అందించాలని, పాఠశాలలలో అవసరమైన మూత్రశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News