Friday, 19 June 2026 01:22:54 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి...

క్రైమ్ వాహనాలు, ప్రాపర్టీ విషయంలో జాగ్రత్త వహించాలి :- పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Date : 13 June 2026 08:50 PM Views : 60

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, క్రైమ్ వాహనాలు మరియు ప్రాపర్టీ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.శనివారం మంచిర్యాల జోన్ పరిధిలోని దండేపల్లి పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. స్టేషన్‌కు చేరుకున్న అనంతరం పరిసరాలను పరిశీలించిన ఆయన, రిసెప్షన్,ఐటీ విభాగం, ఇతర పోలీస్ సిబ్బంది పనితీరును సమీక్షించారు. అలాగే ఎస్‌ఐ రాజవర్ధన్‌ను స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు,ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది సమస్యలను కూడా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. 5S విధానాన్ని అమలు చేస్తూ, పోలీస్ స్టేషన్‌ను వర్టికల్ వారీగా విభజించి సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. క్రైమ్ వాహనాలు, కేసు ప్రాపర్టీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఎలాంటి పెండింగ్‌లు ఉంచకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచి, వారిపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :