Sunday, 13 September 2026 11:17:24 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

తుఫాను కారణంగా పత్తి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 18 November 2025 07:45 PM Views : 276

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ పత్తి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. 2025–26 పత్తి కొనుగోలు సీజన్ నేపథ్యంలో, కేంద్ర టెక్స్టైల్స్ యూనియన్ మంత్రిగిరిరాజ్ సింగ్ జీ కి మంగళవారం ఎంపీ అధికారిక లేఖ పంపి పలు కీలక సూచనలు చేశారు. సీసీఐ ప్రతిపాదించినట్టు రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడం తప్పు నిర్ణయం అని ఎంపీ పేర్కొన్నారు. ఈ అంచనా రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టర్లు మరియు వ్యవసాయ శాఖ డైరెక్టర్ సమర్పించిన ధృవీకరించిన డేటాకి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 6,680 ఎంఎంటిలు పత్తి కొనుగోలు కాగా, 3,175 మంది రైతులు లబ్ధి పొందారు. పత్తి కొనుగోలు మొత్తం విలువ ₹52.25 కోట్లు, అందులో ₹15.04 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటికే మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి మరింత దెబ్బతింటుందని, దిగుబడి అంచనాలను తగ్గించే నిర్ణయాన్ని పునర్విమర్శించాలని ఎంపీ వంశీ కృష్ణ కోరారు. అదేవిధంగా, పత్తి మిల్లర్లు & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సూచించిన మాయిశ్చర్ నార్మ్స్, L1/L2 విభజన సమస్య, స్లాట్ బుకింగ్ కష్టాలు, జిన్నింగ్ మిల్లుల కార్యకలాపాల సమస్యలు వంటి అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సానుకూల చర్యలను ఎంపీ ప్రశంసించారు. టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్, 176 మార్కెట్ యార్డుల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు, సీసీఐతో కలిసి జిన్నింగ్ మిల్లుల మ్యాపింగ్, అవగాహన కార్యక్రమాలు రైతులకు మేలు చేస్తాయని తెలిపారు. ఎంపీ వంశీ కృష్ణ పలు ప్రధాన డిమాండ్లను కోరారు.రాష్ట్ర సగటు పత్తి దిగుబడి 11.74 క్వింటాళ్లుగా కొనసాగిం చాలన్నారు. మాయిశ్చర్ పరిమితిని 20% వరకు సడలించాలన్నారు. మిల్లర్లు, ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ చర్యలతోనే రైతులకు న్యాయమైన ధరలు మరియు సాఫీ కొనుగోలు ప్రక్రియ సాధ్యమవుతుందని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :