ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ పత్తి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. 2025–26 పత్తి కొనుగోలు సీజన్ నేపథ్యంలో, కేంద్ర టెక్స్టైల్స్ యూనియన్ మంత్రిగిరిరాజ్ సింగ్ జీ కి మంగళవారం ఎంపీ అధికారిక లేఖ పంపి పలు కీలక సూచనలు చేశారు. సీసీఐ ప్రతిపాదించినట్టు రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడం తప్పు నిర్ణయం అని ఎంపీ పేర్కొన్నారు. ఈ అంచనా రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టర్లు మరియు వ్యవసాయ శాఖ డైరెక్టర్ సమర్పించిన ధృవీకరించిన డేటాకి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు మొత్తం 6,680 ఎంఎంటిలు పత్తి కొనుగోలు కాగా, 3,175 మంది రైతులు లబ్ధి పొందారు. పత్తి కొనుగోలు మొత్తం విలువ ₹52.25 కోట్లు, అందులో ₹15.04 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటికే మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి మరింత దెబ్బతింటుందని, దిగుబడి అంచనాలను తగ్గించే నిర్ణయాన్ని పునర్విమర్శించాలని ఎంపీ వంశీ కృష్ణ కోరారు. అదేవిధంగా, పత్తి మిల్లర్లు & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సూచించిన మాయిశ్చర్ నార్మ్స్, L1/L2 విభజన సమస్య, స్లాట్ బుకింగ్ కష్టాలు, జిన్నింగ్ మిల్లుల కార్యకలాపాల సమస్యలు వంటి అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సానుకూల చర్యలను ఎంపీ ప్రశంసించారు. టోల్-ఫ్రీ హెల్ప్లైన్, 176 మార్కెట్ యార్డుల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు, సీసీఐతో కలిసి జిన్నింగ్ మిల్లుల మ్యాపింగ్, అవగాహన కార్యక్రమాలు రైతులకు మేలు చేస్తాయని తెలిపారు. ఎంపీ వంశీ కృష్ణ పలు ప్రధాన డిమాండ్లను కోరారు.రాష్ట్ర సగటు పత్తి దిగుబడి 11.74 క్వింటాళ్లుగా కొనసాగిం చాలన్నారు. మాయిశ్చర్ పరిమితిని 20% వరకు సడలించాలన్నారు. మిల్లర్లు, ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ చర్యలతోనే రైతులకు న్యాయమైన ధరలు మరియు సాఫీ కొనుగోలు ప్రక్రియ సాధ్యమవుతుందని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ స్పష్టం చేశారు.
Admin
E Nivas News