Tuesday, 28 July 2026 11:36:48 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

తుఫాను కారణంగా పత్తి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 18 November 2025 07:45 PM Views : 243

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ పత్తి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. 2025–26 పత్తి కొనుగోలు సీజన్ నేపథ్యంలో, కేంద్ర టెక్స్టైల్స్ యూనియన్ మంత్రిగిరిరాజ్ సింగ్ జీ కి మంగళవారం ఎంపీ అధికారిక లేఖ పంపి పలు కీలక సూచనలు చేశారు. సీసీఐ ప్రతిపాదించినట్టు రాష్ట్ర సగటు పత్తి దిగుబడిని 11.74 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడం తప్పు నిర్ణయం అని ఎంపీ పేర్కొన్నారు. ఈ అంచనా రాష్ట్రంలోని 33 జిల్లా కలెక్టర్లు మరియు వ్యవసాయ శాఖ డైరెక్టర్ సమర్పించిన ధృవీకరించిన డేటాకి విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 6,680 ఎంఎంటిలు పత్తి కొనుగోలు కాగా, 3,175 మంది రైతులు లబ్ధి పొందారు. పత్తి కొనుగోలు మొత్తం విలువ ₹52.25 కోట్లు, అందులో ₹15.04 కోట్లు ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇప్పటికే మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి మరింత దెబ్బతింటుందని, దిగుబడి అంచనాలను తగ్గించే నిర్ణయాన్ని పునర్విమర్శించాలని ఎంపీ వంశీ కృష్ణ కోరారు. అదేవిధంగా, పత్తి మిల్లర్లు & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సూచించిన మాయిశ్చర్ నార్మ్స్, L1/L2 విభజన సమస్య, స్లాట్ బుకింగ్ కష్టాలు, జిన్నింగ్ మిల్లుల కార్యకలాపాల సమస్యలు వంటి అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సానుకూల చర్యలను ఎంపీ ప్రశంసించారు. టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్, 176 మార్కెట్ యార్డుల్లో ప్రత్యేక సహాయ కేంద్రాలు, సీసీఐతో కలిసి జిన్నింగ్ మిల్లుల మ్యాపింగ్, అవగాహన కార్యక్రమాలు రైతులకు మేలు చేస్తాయని తెలిపారు. ఎంపీ వంశీ కృష్ణ పలు ప్రధాన డిమాండ్లను కోరారు.రాష్ట్ర సగటు పత్తి దిగుబడి 11.74 క్వింటాళ్లుగా కొనసాగిం చాలన్నారు. మాయిశ్చర్ పరిమితిని 20% వరకు సడలించాలన్నారు. మిల్లర్లు, ట్రేడర్స్ అసోసియేషన్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ చర్యలతోనే రైతులకు న్యాయమైన ధరలు మరియు సాఫీ కొనుగోలు ప్రక్రియ సాధ్యమవుతుందని ఎంపీ గడ్డం వంశీ కృష్ణ స్పష్టం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :