ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి సిపిఐ కార్యకర్త కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ,సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ.. గత పార్లమెంటు ,శాసనసభ ఎన్నికలలో నియంతృత్వ బిఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడటంలో తోడ్పాటు నిందించిన సిపిఐ ,ఈ మున్సిపల్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం హర్షణీయమని, వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని అన్నారు. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మరిపెడ పురపాలక ఎన్నికలలో సిపిఐ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని ,బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికలలో ఓటు అడిగే నైతిక హక్కు లేదని, ప్రజాధనాన్ని పదేళ్లపాటు లూటీ చేసిన బిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి,కాంగ్రెస్ అభ్యర్థులను ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం కాంగ్రెస్ జిల్లా నాయకులు వంటి కొమ్ము యుగేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు, తాజుద్దీన్, గుండాగాని వేణు, యం డి అఫ్జల్, గుండాగాని వెంకన్న, సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ ,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అబ్దుల్ రషీద్, పోలేపాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు,
Admin
E Nivas News