ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు తెలంగాణ గణిత ఫోరం పెద్దపల్లి జిల్లా విభాగం సూచనల మేరకు శనివారం మంథనిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) మండల స్థాయి గణిత ప్రతిభ పాటవ పోటీ నిర్వహించారు. ఈ పోటీలలో మంథని మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు పాల్గొన్నారు. గణిత ప్రతిభా పాటవ పోటీకి ఆంగ్ల మాధ్యమం నుండి 14 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి బహుమతి ఎన్. పరమేష్, రెండవ బహుమతి ఎం. జోత్స్న జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ మంథని, తృతీయ బహుమతి ఎన్. ధనుష్ జెడ్ పి హెచ్ ఎస్ బాయ్స్ మంథని, రెసిడెన్షియల్ విభాగంలో ప్రధమ బహుమతి కె.సాయి వినయ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ మంథని, రెండవ బహుమతి ఈ. శ్రీ వల్లి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ మంథని, తృతీయ బహుమతి ఆర్. విశాల్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ బాయ్స్ మంథని విద్యార్థులు గెలుపొందగా వీరు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంశా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎస్ సుమలత, వివిధ పాఠశాల గణిత ఉపాధ్యాయులు, టిఎంఎఫ్ మండల శాఖ బాధ్యులు ఎన్. పరంజ్యోతి, ఎస్.శ్రీనివాస్ పరిశీలకులుగా శ్రీ జి.భరత్ రెడ్డి లు పాల్గొన్నారు.
Admin
E Nivas News