Tuesday, 15 September 2026 05:29:22 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

రైతులను మాయ మాటలతో మోసం చేసిన ప్రభుత్వం...

పోస్ట్ కార్డు ద్వారా ప్రభుత్వం స్పందించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్

Date : 19 March 2026 07:13 AM Views : 217

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతుల తోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. బుధవారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వాటిని మర్చిపోయారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ దీనికి బాధ్యులేనని ధ్వజమెత్తారు. రైతులను గోస పెడుతున్న ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండడం కష్టమన్నారు . ఇప్పటికే ప్రజలు విసిగి వేసారి పోతున్నారన్నారు. ఒక విడత రైతు భరోసాను ఎగొట్టి రైతులకు అన్యాయం చేశారన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలను విస్మరించి పాలన చేయడం సబబు కాదని విమర్శలు గుప్పించారు. 10 వేల మంది రైతులతో ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డ్స్ ద్వారా రైతు భరోసా, ఇతర హామీలు నెరవేర్చాలని కోరుతూ పోస్ట్ చేశామన్నారు. అంతేకాకుండా ఎరువుల కోసం గత ప్రభుత్వంలో ఏనాడైన రైతులు ఇబ్బంది పడిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్లు తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కాంతయ్య,మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, సర్పంచ్ ఎల్తపు సుధాకర్, చాంద్, రవి, తిరుపతి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: