Tuesday, 28 July 2026 10:18:53 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత..

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

Date : 17 May 2026 11:37 PM Views : 72

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పారిశుధ్య నిర్వహణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో పారిశుద్ధ్యం, రోడ్డు విస్తరణ పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రజలకు త్రాగునీరు, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనుల నిర్వహణపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తద్వారా ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయని, వ్యాధుల నియంత్రణలో పరిశుభ్రత కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం హరహదారి విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని, అభివృద్ధి పనుల అనంతరం రహదారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ప్రజలతో మాట్లాడి వార్డులో నెలకొన్న సమస్యల వివరాలు తెలుసుకొని అధికారుల సమన్వయంతో త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం 6వ వార్డులో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాన్ని లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ అంజలి, వైస్ చైర్ పర్సన్ రాజేశ్వరి లతో కలిసి సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు సంబంధించి రైతుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా కేటాయించిన ప్రకారం గోదాములు, రైస్ మిల్లులకు వేగంగా తరలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :