Wednesday, 29 July 2026 07:23:16 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్ల పంపిణీ

Date : 09 October 2025 09:36 PM Views : 293

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 15 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు గురువారం వెంకట్రావుపేట లో పౌష్టికాహారం కిట్లను పంపిణీ చేసినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. మంచిర్యాల జిల్లా టీబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్ ఆదేశాల మేరకు( బ్రోస్ ఎన్జీవో) అనే స్వచ్ఛంద సంస్థ అందజేస్తున్న నిత్యావసర సరుకులతో కూడిన కిట్ లను ఎంపిక చేసిన లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులతో పాటు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్ సతీష్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమం లో టీబీ సూపర్ వైజర్ సురేష్ , ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్ వైజర్లు శోభ , మార్త , హెల్త్ అసిస్టెంట్లు గఫూర్, వేణు, ఇసాక్ అహ్మద్ మరియు పలువురు ఏఎన్ఎంలు , ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :