ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా రాజారాం పల్లి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఆ గ్రామ నాయకులు బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. సర్వే నెంబర్ 292లో 20 గుంటల భూమిని ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి ఇస్తామని అలాగే మరో రెండెకరాల భూమిని తహసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణానికి ఉచితంగా భూమిని ఇవ్వడానికి ఏలేటి రాజారాం రెడ్డి వారసులు ఏలేటిచంద్రారెడ్డి, అనిల్ రెడ్డిలు ఇస్తామని మంత్రికి తెలిపారు . కాగా ఈ మూడు భవన నిర్మాణాలకు తొందరగా నిర్మించినట్లయితే ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని వారు కోరారు. అంతేకాకుండా రాజారంపల్లి బస్టాప్ వద్ద ఎక్స్ ప్రెస్ బస్సులను కూడా ఆపాలని కోరారు. దీనికి మంత్రి స్పందించి వెంటనే ప్రభుత్వం అనుమతులు తీసుకొని నిర్మాణాలు ప్రారంభించే దిశగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏలేటి చంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ సంఘ రమేష్ యాదవ్,ఉపసర్పంచ్ మేరుగు జంపన్న (జానీ) మాజీ ఎంపీటీసీ గొల్లపల్లి మల్లేశం, ఏలేటి అనిల్ రెడ్డి లు ఉన్నారు.
Admin
E Nivas News