Wednesday, 29 July 2026 06:37:22 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మెదక్ జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన...

కార్నర్ మీటింగుల్లో పాల్గొన్న మంత్రి

Date : 04 February 2026 10:09 PM Views : 177

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ మరియు 15వ వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని తీవ్రంగా విమర్శించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని, మొత్తం మీద సుమారు 30 వేల కోట్ల రూపాయల అప్పులు చేసినట్టు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేవలం మూడు నియోజకవర్గాల అభివృద్ధికే పరిమితమై, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతినెల సుమారు 5 వేల కోట్ల రూపాయల వరకు అప్పుల మిత్తి చెల్లిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.అలాగే, సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని, ఇది ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలాన్ని ప్రస్తావిస్తూ, ఉద్యమ సమయంలో కార్యకర్తలు సొంత డబ్బులతోనే ఉద్యమాలు నిర్వహించారని, అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో సుమారు 900 కోట్ల రూపాయలు ఉన్నాయని ఆరోపించారు. ఆ నిధులపై పూర్తి స్థాయి ఎంక్వైరీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించినట్టు మంత్రి వివేక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల కోసం పారదర్శక పాలన, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: