Sunday, 13 September 2026 06:18:39 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

ఖానాపూర్ డబల్ బెడ్ రూమ్ లో పూర్తిస్థాయిలో సమగ్రంగా విచారణ జరిపించి అనరులను తొలగించాలని కలెక్టర్ కు వినతి

Date : 24 November 2025 09:17 PM Views : 265

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కొమరం భీమ్ చౌరస్తాలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన ఇండ్లలో అనర్హులను తొలగించి, అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూములు ఇవ్వాలని సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ, ఎంసీపీఐ(యు), డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలోనిర్మల్ జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునరికారి రాజేష్, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్ లు మాట్లాడుతూ ఖానాపూర్ డబల్ బెడ్రూములలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లను కేటాయించారని గత కొన్ని నెలల నుండి అధికారుల దృష్టికి రాతపూర్వకంగా తీసుకువచ్చినప్పటికీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా నామమాత్రంగా సర్వే చేసి కొంత లిస్టు పెట్టి చేతులు దులుపుకున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూయించలేదు. మిగతా వాటిలో విచారణ జరపడంలో జాప్యం జరుగుతుందని, ఎప్పుడు పూర్తిస్థాయి లో విచారణ చేస్తారో ఇంకెంతకాలం గడుపుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అర్హులైన పేదల కోసం కేటాయించిన ఇండ్లను వారికి చెందకుండా ఇతరులకు కేటాయించడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు స్పందించి సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా తొందరనే పరిష్కారం చేసి నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, తోటరాద, కమల, గౌస్, షాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: