ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం క్రిస్మస్ పర్వదిన వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయాన్నే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చర్చిలకు వెళ్లి ప్రార్థనలు చేశారు.ఈ సందర్భంగా పాస్టర్లు యేసు ప్రవచనాలు వినిపించి ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రజలంతా చల్లగా ఉండాలని యేసయ్యను ప్రార్థించినట్లు తెలిపారు.లక్షెట్టిపేట మున్సిపాలిటీలో స్థానిక సి ఎస్ ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. చర్చికిముఖ్య అతిథిగా మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు హాజరై ప్రార్థనల్లో పాల్గొని చిన్న పిల్లతో కలిసి కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు .పాస్టర్ డేవిడ్ పాల్ ప్రార్థనలతో తో పాటు గీతాలు ఆలపించారు. భక్తులు ప్రార్థనలు చేశారు. సురేఖ మాట్లాడుతూ అందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సమానత్వం, సేవా భావనలు క్రిస్మస్ సందేశమని ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, కంది మోహన్,యూత్ అధ్యక్షులు రాందేని మరియు కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News