ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రిస్క్రిప్షన్ లేకుండా మైనర్లు, అనుమానితులకు టాబ్లెట్స్ ఇస్తె చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని మెడికల్ షాప్ యజమానులకు గోదావరిఖని ఏసిపి మడత రమేష్ సూచించారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో మెడికల్ దుకాణ యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపి మడత రమేష్ మాట్లాడుతూ సోమవారం రాత్రి మంథనిలోని తమ్మి చెరువు కట్టపై ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా కనిపించారని, పెట్రోలింగ్లో భాగంగా కానిస్టేబుల్స్ తనిఖీ చేయగ వారి వద్ద టాబ్లెట్లు, సిరంజీలు లభించాయన్నారు. పట్టుకున్న వారిని విచారించగా వారికి గంజాయి సేవించే అలవాటు ఉందని, అది లభించకపోవడంతో మత్తు కొరకు మెడికల్ షాప్ లో కొన్ని టాబ్లెట్లను కొనుగోలు చేసి వాటిని నీటిలో కలిపి ఇంజక్షన్ ద్వారా తీసుకుంటున్నట్లు తెలిపారన్నారు. వీరిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేస్తామని ఏసిపి తెలిపారు. గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడితే జరిగే అనర్థాలపై మత్తు పదార్థాలకు బానిసలైన యువకుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అక్రమంగా మత్తు పదార్థాలు సేవిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ బుద్దే స్వామి, SI సందీప్ కుమార్, సిబ్బంది, మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు.
Admin
E Nivas News