Sunday, 13 September 2026 11:58:32 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బిసి రిజర్వేషన్లను అడ్డుకుంటున్న బిజెపి పైన పోరాటమే

అక్టోబర్ 18 న మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నిరసన, ధర్నా కార్యక్రమాలకు సీపీఎం పిలుపు

Date : 15 October 2025 07:59 PM Views : 296

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కాకుండా అడ్డుకుంటున్న బిజెపి మోడీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని, అక్టోబర్ 18 న బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర బంద్ సందర్భంగా బిజెపి,మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా పోరాటం కొనసాగాలని సిపిఎం పిలుపునిస్తుందన్నారు . సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి గవర్నర్ కు, రాష్ట్రపతికి కేంద్ర,మోడీ ప్రభుత్వానికి పంపించి ,6 నెలలు గడిచిపోయిన నేటికీ బీసీ రిజర్వేషన్ల కు చట్టబద్ధత ఎందుకు కల్పించలేదని సిపిఎం ప్రశ్నిస్తుందన్నారు. బిల్లులను తమ దగ్గరలో ఉంచుకొని నీచ రాజకీయాలు చేయడం రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న రాష్ట్రపతి, గవర్నర్ సరైనదేనా...? బిజెపి, మోడీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తే విధంగా వీరి వైఖరి ఉన్నది. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి చట్టబద్ధత కల్పించడానికి అవకాశాలున్న బిజెపి మోడీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయడం కోసమే చూస్తున్నదితాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక తీరు ఇతర రాష్ట్రాల్లో మరో తీరుగా వ్యవహరిస్తున్నదన్నారు . బిజెపి నీచ రాజకీయాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు ఇంకా సామాజికంగా వెనుకబాటుతనంలోకి నెట్టబడుతున్నారు.బిజెపి కి తగిన గుణపాఠం చెప్పే విధంగా కేంద్ర వైఖరిని ఎండగడుతూ పెద్ద ఎత్తున పోరాటాలు చేయవలసిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ 18 న బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.కేంద్రం పైన పోరాటం చేయడం కోసం రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిన పార్టీలను, సంఘాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పైన పోరాటాలకు ముందు పీఠాన ఉండాలని, బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో బోడంకి చందు మండల కార్యదర్శి,కమిటీ సభ్యులు సిడం సమ్మక్క,బోగే నాగజ్యోతి,బండారి శ్రీనివాస్,బండారి రాజేశ్వరి, భోగే సత్యం,కొండపర్తి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :