ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమం 2025 -26 అమలుకు సంబంధించి జిల్లాలోని ఇతర శాఖలతో సమన్వయ సమావేశం జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీర పురుషోత్తం నాయక్ అధ్యక్షతన, వయోజన విద్యాశాఖ కార్యాలయంలో బుధవారం జరిగింది.ఈ కార్యక్రమం ను ఉద్దేశించి పురుషోత్తం మాట్లాడుతూఉల్లాస్ కార్యక్రమం లో భాగంగా జిల్లాలో 31,435 నిరక్షరాస్యులు మరియు వారికి చదువు నేర్పించుటకు 3013 వాలంటీర్ ఉపాధ్యాయులను ను గుర్తించి ఉల్లాస్ ఆప్ లో నమోదు చేయడం జరిగిందని,నిరక్షరాస్యులను అక్షరాస్యులు గా చేసే ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి,ప్రతి గ్రామ సంఘం నుండి ఇద్దరు ఓ బీ లకు మరియు విఓఎ రేపటి నుండి రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన సి ఆర్ పి లచే శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని,శిక్షణ కార్యక్రమాలు విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి,డిఎవై ఎస్ ఓ హనుమంత రెడ్డి,జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి,డి ఆర్ డి ఎ ఆఫీస్ డి.పి.ఎమ్ రామచందర్,ఎస్ఈఆర్ పినుండి వచ్చిన సి ఆర్ పి లు తిరుమల , అమీనా డి ఆర్ పి సుమన్ లు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News