Monday, 14 September 2026 03:33:33 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రతి విద్యార్థి వ్యాపార మెలికలు తెలుసుకోవాలి...

Date : 16 March 2026 09:39 PM Views : 265

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రతి విద్యార్థి వ్యాపారంలో మెలికలు తెలుసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహాత్మా సంతోష్ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం వాణిజ్యశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, పోస్టర్ ప్రజంటేషన్, పోటీలు నిర్వహించారు. విద్యార్ధులచే ఎంటర్ ప్ప్రెన్యూర్ విధానం కింద వ్యాపార మెళకువలను పెంచడం కోసం ప్రత్యేక వ్యాపార స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో మక్కగారెలు, డబల్ కమిట, పేపర్ డిజైనింగ్ ఫొటో ప్రేమ్ మొదలైన వ్యాపార స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వినియోగ దారుల హక్కులపై ప్రత్యేక అవగాహనా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. విద్యార్థులంతా వినియోగ దారుల హక్కులపై అవగాహనా కలిగి ఉండాలని సరైన ఉత్పత్తిని సరైన ధరకు కొనడం ప్రజల హక్కు అని పేర్కొన్నారు. భవిష్యత్ లో వ్యాపారరంగం మరింతగా విస్తరిస్తుందని యువత అందులో మంచి అవకాశాలను అంది పుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. సంతోష్ కుమార్, అధ్యాపకులు జాడి శంకరయ్య , తన్నీరు సురేష్, లైబ్రేరియన్ నాగేశ్వర్ కవిత, మల్లయ్య, చంద్రశేఖర్ , శ్రీనివాస్, సంధ్యారాణి, సత్యనారాయణ, కాంతయ్య, నివేదిత, స్వామి విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :