Tuesday, 28 July 2026 06:58:05 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం... భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, సిర్పూర్ ఎమ్మెల్యే

Date : 25 November 2025 11:42 PM Views : 205

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రెనుదో మంగళవారం కలిసి జిల్లాలో గ్రామ పంచాయతీ రిజర్వేషన్లలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం, మరియు సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 335 సర్పంచ్ స్థానాలకు గాను కేవలం 20 స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని తెలిపారు. బెజ్జూర్ మండలంలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా బీసీలకు కేటాయించలేదని అన్నారు. కాగజ్నగర్ డివిజన్లో కేవలం 11.11% సర్పంచ్ సీట్లు బీసీలకు కేటాయించారని, ఆసిఫాబాద్ డివిజన్లో కేవలం 7.21 % కేటాయించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన జీఓ మరియు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం బీసీలకు ఇవ్వాల్సిన 23 శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారని, దీనిని సరిదిద్దాలని జిల్లా కలెక్టర్ కువినతి పత్రం సమర్పించారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42 శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో సర్పంచ్ స్థానాలకు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మొత్తం మీద కేవలం 9 శాతం సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారని తెలిపారు.వెంటనే ఈ బీసీ రిజర్వేషన్లలో జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్, జిల్లా కోశాధికారి కొలిపాక కిరణ్, అరుణ్ లోయ, అనిల్, గాజుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: