ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : డిసెంబర్ 10 నుండి 12 వరకు వరంగల్ లో జరిగే పిడిఎస్ యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్షెట్టిపేట మండల కేంద్రంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీనివాస్ కోరారు. ఆదివారం ఆహ్వాన సంఘం పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.శ్రీకాంత్ మాట్లాడుతూ విప్లవ విద్యార్థి ఉద్యమంలో చెదిరిపోని చరిత్రను లిఖించింది. ఉస్మానియా యూనివర్సిటీలో పురుడు పోసుకొని నేను దేశవ్యాప్తంగా అర్ధ శతాబ్దానికి పైగా విద్యార్థుల గొంతుకగా పనిచేస్తూ ఉజ్వలమైన చరిత్రను సృష్టించిందన్నారు. మతోన్మాద, చాందసవాదులకు పాలకవర్గాలకు సింహా స్వప్నమైందన్నారు. విద్యార్థి సంఘం కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పరిమితమే కాకుండా నిరుద్యోగ, మహిళ, రైతంగా, కార్మిక ఉద్యమాలకు బాసటగా పి డి ఎస్ యు నిలుస్తుందన్నారు. విద్యార్థులను కూడగట్టి ఉద్యమాన్ని ఉద్యమిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యా విధానం 2020, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, మోడీ గత 12 ఏళ్లుగా అవలంబిస్తున్న విధానాల వల్ల దేశంలో విపత్కార పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న విద్యారంగానికి అనేకమైన హామీలు ఇచ్చి విఫలమైందని ఆరోపించారు. ఈ తరుణంలో విద్యార్థి సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించి విద్యారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 10, 11, 12 తేదీలలో వరంగల్ లో జరిగే పిడిఎస్ యు తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని, ఈ మహాసభలకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యుపిడిఎస్ యు జిల్లా నాయకులు కార్తీక్, విజయ్ శ్రావణ్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News