ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు శనివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, ఎలక్ట్రిసిటీ బోర్డ్ మెంబర్ శశిభూషణ్ కాచే, మాజీ పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్,ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం, బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్, మాజీ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కిసాన్ జి, నాయకులు మాట్లాడుతూ 19వ శతాబ్దంలో స్త్రీలు చదువుకోవడం అపరాధంగా భావించిన కాలంలో, అణచివేతకు గురైన వర్గాలకు విద్య అనే ఆయుధాన్ని అందించిన తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమె చరిత్రలో నిలిచారన్నారు. జనవరి 3న ఆమె జయంతిని జరుపుకోవడం కేవలం ఒక మహానుభావురాలిని స్మరించుకోవడమే కాదని, సమానత్వం, సామాజిక న్యాయం పట్ల మన బాధ్యతను మరోసారి గుర్తు చేసుకోవడమే అన్నారు. నేటి సమకాలీన సమాజంలో మహిళల అక్షరాస్యత రేటు పెరగడం, మహిళల రాజకీయాల్లో, క్రీడల్లో సాధిస్తున్న విజయాలను చూస్తుంటే, సావిత్రిబాయి ఆశయాలు ఎంత ముఖ్యమైనవో అర్థమవుతుందన్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియమ్మ ఆశీస్సులతో, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో తెలంగాణలోని పేద మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అన్నిరకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో మహిళల అభ్యున్నతి కోసం, కోటిమంది మహిళలను కోటీశ్వరాలను చేయడమే లక్ష్యంగా, సంక్షేమాల కోసం మేం అందరం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ తెలంగాణలో విద్య, ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతున్నాయి. బీసీ వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా విద్య, రవాణా, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడమే మా ప్రభుత్వ లక్ష్యమని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Admin
E Nivas News