Tuesday, 28 July 2026 07:00:20 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

పంచాయతీ ఎన్నికల్లో మంత్రి శ్రీధర్ బాబు సూచించిన అభ్యర్థులను గెలిపించండి....! గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి దోహదపడండి

కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ

Date : 05 December 2025 03:58 PM Views : 343

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పంచాయతీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబులు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా అమలు చేయుటకు నీతి నిజాయితీ గల అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయుటకు కావలసిన నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఒప్పించి పెద్ద ఎత్తున సమకూరుస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించి మీ మీ గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి దోహదం చేసుకునేందుకు సహకరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ సెల్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు, కాంగ్రెస్ మద్దతిస్తున్న అభ్యర్థుల వ్యతిరేకంగా పనిచేసే కాంగ్రెస్ నాయకులపై పార్టీ పరంగా చర్యలు ఉంటాయని బీసీ సెల్ నాయకుడు గోటికార్ కిషన్ జీ తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :