ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పంచాయతీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబులు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోటికార్ కిషన్ జీ ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల సమగ్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లో సక్రమంగా అమలు చేయుటకు నీతి నిజాయితీ గల అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయుటకు కావలసిన నిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఒప్పించి పెద్ద ఎత్తున సమకూరుస్తున్నారన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించి మీ మీ గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి దోహదం చేసుకునేందుకు సహకరించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీసీ సెల్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు, కాంగ్రెస్ మద్దతిస్తున్న అభ్యర్థుల వ్యతిరేకంగా పనిచేసే కాంగ్రెస్ నాయకులపై పార్టీ పరంగా చర్యలు ఉంటాయని బీసీ సెల్ నాయకుడు గోటికార్ కిషన్ జీ తెలిపారు.
Admin
E Nivas News