ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బి ఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు 50వ జన్మదిన వేడుకలను శుక్రవారంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బారాస శ్రేణులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా కేకులు కట్ చేసి ఒకరికొకరు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వంఅని,అప్పుడే తెలంగాణ ప్రజలందరకి న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలను ప్రజలను అమాయకులను చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి గద్దె ఎక్కిందని,తీరా వారి మాటను నమ్మి ఓటు వేసిన ప్రజలంతా ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా కేసీఆర్ ముఖ్యమంత్రి చేద్దామా అని ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాయకులుకార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Admin
E Nivas News