ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారిణి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించానని అటెండర్ బొల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మంచిర్యాల జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. మంచిర్యాల జిల్లా వ్యవసాయ శాఖలో అటెండర్ గా పనిచేస్తున్న బొల్లి శ్రీనివాస్ కార్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్యకు యత్నించారు. వ్యవసాయ అధికారిణి సురేఖ తనపై నిరంతరం వేధింపులకు పాల్పడుతున్నారని, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నానని బాధితుడు పేర్కొన్నారు. సహచరులు వెంటనే స్పందించి అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. జిల్లా జడ్జి కూడా ఆసుపత్రికి వెళ్లి బాధితుడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాధితుడి భార్య కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Admin
E Nivas News