Saturday, 13 June 2026 12:10:28 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

జూన్ నెలలో 2 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు..

Date : 25 May 2026 09:19 AM Views : 67

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణసీఎం రేవంత్ రెడ్డిసర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పేద వర్గాల ప్రజలకు శుభవార్త చెప్పింది. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, అధ్యక్ష తన జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ లో పేదల ఇండ్ల నిర్మాణానికి పెద్దపీట వేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. పూరి గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిది ద్దాలని కంకణం కట్టుకుంది.జూన్ 1 నుంచి ఇందిర మ్మ పథకం రెండో విడత కింద పేద కుటుంబాలకు 2. లక్షల 50 వేల ఇళ్లు మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే మొదటి విడత కింద పేద వర్గాల ప్రజలకు ఇండ్ల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వంతాజాగా రెండో విడత ఇందిర మ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. రెండో విడ తలో భాగంగా రాష్ట్రం లోని లక్షల మంది పేద వర్గాల ప్రజలకు ఇండ్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇందిర మ్మ ఇండ్లు మంజూరు కు అనుమతి ఇచ్చిం ది. అయితే, తొలి విడతలో ప్రారంభిం చిన ఇందిరమ్మ ఇండ్ల లో జూన్ 2వ తేదీ నాటికి దాదాపు లక్ష గృహ ప్రవేశాలు జర గాలని నిర్ణయించింది. రాష్ట్రంలో నిర్వహించి న సర్వేల ప్రకారం15వేల కుటుంబాలు ఇప్పటికీ గుడిసెల్లో నివాసం ఉంటున్నా రని, వెంటనే వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించిం ది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉన్న సమయం లో మంజూరు చేసి, పూర్తికాక నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా సాయం అందించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా హైదరా బాద్ మహానగరంలో క్యూర్ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గా ల్లోని పేదలకు లక్ష ఇండ్లను కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించింది.కొలాం ఆదివాసీలకు కుము రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో సర్కార్ కట్టించిన ఇందిరమ్మ ఇండ్లను జూన్1వ తేదీన ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు అందరూ ఆ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పా రు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందు కు కావాల్సిన భూ సేకరణ, పునరావా సం, మౌలిక వసతుల సదుపాయాల కల్పన కు రూ.587 కోట్లను కేటాయిస్తూ.. తెలంగా ణ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :