Tuesday, 28 July 2026 07:49:26 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

గంజాయి, మాదకద్రవ్యాలను రూపుమాపే దిశగా కృషి చేయాలి

ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 04 October 2025 09:38 PM Views : 316

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలను రూపుమాపే దిశగా కృషి చేయాలి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. స్టేషన్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులను ప్రతిరోజు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రతతో ఉంచుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పూర్తిగా పరిశీలించి పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలను పరిశీలించి వాటి కేసుల వివరాలు తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సు లేకుండా ఉండాలని తెలిపారు. కేసులో దర్యాప్తు, నేర పరిశోధన పై పురోగతి సాధించాలని, నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా నివేదికలను పూర్తి చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ నిర్వహణలో 5S విధానాన్ని అమలు చేయాలని సూచించారు. రానున్నది ఎన్నికల సమయం ప్రతి గ్రామాన వీపీఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేసి, సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకొని, ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా ప్రతిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ క్రైమ్, డిజిటల్ ఫ్రాడ్, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం వాటి వల్ల కలుగు అనర్ధాల పై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. యువత, మారుమూల గ్రామీణ ప్రాంత ప్రజలు చెడు వ్యసనాల బారిన పడకుండా, చదువు పై ఉన్న ఆవశ్యకతను తెలియజేసే ఉన్నత చదువులు అభ్యసించేలా ప్రోత్సహించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు పోలీసులపై నమ్మకం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, బోత్ సిఐ ఏ వెంకటేశ్వరరావు, బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :