Tuesday, 28 July 2026 11:17:52 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

సింగరేణి కార్మికుల హక్కునెలకు 10,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి...

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

Date : 25 March 2026 08:15 AM Views : 117

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సింగరేణి కార్మికుల సంక్షేమంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మంగళవారం ప్రత్యేకంగా స్పందించారు. సంవత్సరాల పాటు గనుల్లో కష్టపడి పనిచేసిన కార్మికులకు రిటైర్మెంట్ అనంతరం గౌరవప్రదమైన జీవితం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకంగా రిటైర్ అయిన సింగరేణి కార్మికులకు నెలకు కనీసం 10,000 పెన్షన్ అందించాలని గట్టిగా డిమాండ్ చేశారు. “సింగరేణి కార్మికులు తమ జీవితాన్ని గనుల్లో కష్టపడి దేశానికి అంకితం చేశారు. అలాంటి వారికి రిటైర్మెంట్ తర్వాత కనీస భద్రత కూడా లేకపోవడం బాధాకరం. కనీసం 10,000 నెలకు పెన్షన్ ఇవ్వడం వారి హక్కు” అని ఎంపీ పేర్కొన్నారు.ఈ విషయంపై పలుమార్లు ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కార్మికుల కష్టాన్ని గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు. చివరగా, “సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్‌ను వెంటనే అమలు చేయాలి. లేకపోతే వారి హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం అవుతుంది” అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణహెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :