ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నిజామాబాద్ జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముఠానుఅడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కారుతో గంజాయి స్మగ్లర్లు ఢీ కొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌమ్య కడుపు పైనుండి కారు వెళ్ళడంతో, లివర్, కిడ్నీడ్యామేజ్అయ్యాయని, పక్కటెముకలు విరిగి పోవడంతోపాటు ఎడమ మూత్రపిండాన్ని తొలగించామని వైద్యుల ప్రకటించారు. పరిస్థితి విషమంగా ఉన్నసౌమ్య వైద్యానికి సహకరిస్తుందని నిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
Admin
E Nivas News