ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / కరీంనగర్ : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ బైక్పై 277 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి.శుక్రవారం కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అటుగా వచ్చిన గోదాం గడ్డకు చెందిన అబ్దుల్ ఖయ్యూమ్ అనే వ్యక్తి బైక్ నంబర్ టీఎస్ 02 ఈఎక్స్ 1395 ఆధారంగా ఆన్లైన్లో తనిఖీ చేయగా 277 చలాన్లు పెండింగ్లో ఉన్న విషయం వెలుగు చూసింది. ఐదు సంవత్సరాలకు పైగా 277 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు పేరుకుపోయిన ఆ మోటార్ సైకిల్ను తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనంపై మొత్తం రూ. 79,845 జరిమానా బకాయి ఉన్నట్లు గుర్తించి, వెంటనే దానిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
Admin
E Nivas News