ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని ప్రెస్ క్లబ్ లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ప్రెస్ క్లబ్ భవన్ తలుపును ధ్వoసం చేసి లోపలికి ప్రవేశించారు. ప్రెస్ క్లబ్ లో ఉన్నటువంటి ల్యాప్ ట్యాప్ ను ఎత్తుకెళ్లారు. తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తూ మందు బాబులకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు. ఈ దొంగతనం విషయమై ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బోనగిరి కుమార్, ప్రధాన కార్యదర్శి సందీప్ యాదవ్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపతి సురేష్ పేర్కొన్నారు.
Admin
E Nivas News