ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాంబండ తండా సర్పంచ్ మాలోత్ మాలి ఉమ్లా అన్నారు. శుక్రవారం బస్సు గ్రామానికి చేరుకోగా సర్పంచ్ మాలి ఉమ్లా,తండా పెద్దలు, నాయకులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాలి ఉమ్లా మాట్లాడుతూ.. ఉదయం మహబూబాబాద్ నుండి బయలుదేరిన బస్సు కురవి, మరిపెడ, గిరిపురం క్రాస్ రోడ్, పాంబండ తండా, తాళ్ళ ఊకల్, తానంచర్ల మీదుగా సూర్యాపేటకు చేరుకుంటుంది. మధ్యాహ్నం సూర్యాపేట నుండి బయలుదేరిన బస్సు నూతనకల్, తానంచర్ల, తాళ్ళ ఊకల్, పాంబండ తండా, గిరిపురం క్రాస్ రోడ్, మరిపెడ బంగ్లా మీదుగా మహబూబాబాద్ కు చేరుకుంటుంది.ఉదయం, మధ్యాహ్నం,సాయంత్రం పాంబండ తండా మీదుగా మహబూబాబాద్ నుండి సూర్యాపేట, అలాగే సూర్యాపేట నుండి మహబూబాబాద్ కు బస్సు సర్వీసు నడుస్తుందని తెలిపారు.ఈ బస్సు సర్వీస్ ను గ్రామస్తులు,తండా వాసులు, పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్టిసి బస్సు ఏర్పాటుతో మరిపెడ మండలంలోని పాంబండ తాండవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుగులోతు ఇరానీ, వార్డు మెంబర్లు బిచ్చు, నరేష్, బద్రు, అరుణ, సునీత, తండా పెద్దలు రెడ్యా ,నాయకులు గోపి, వెంకన్న, బాలరాజు, రెడ్యా, రవి ,కుమార్, నాగరాజ్ లోకేష్, బాబు, బాలు, మంగ్యా, నరేష్, మల్సూర్, సక్రం, సోమ్లా, నరహరి, లాల్ సింగ్, యుగంధర్, వీరన్న తండా పెద్దలు,తండావాసులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News