ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఆయా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయ కార్యాలయాలతో పాటు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయంశంకర్ తన జీవితాన్ని మొత్తం తెలంగాణ కోసం ధారపోసిన త్యాగశీలి అని తెలంగాణ జాతి ఆయనకు రుణపడి ఉందని తెలిపారు. తెలంగాణ సిద్ధాంతకర్త తొలిదశ, మలిదశ, తుది దశ పోరాటాలకు సలహాలు ఇచ్చిన మహనీయుడు అన్నారు. తెలంగాణ ప్రజల్లో భావజాలాన్ని నింపడానికి అనేక పోరాటాలు సిద్ధాంతాలు సూచించిన మహనీయుడని ఆయన కృషి ఫలితంగానే నేడు తెలంగాణ వచ్చిందని వివరించారు. తను క్యాన్సర్ తో బాధపడుతూ కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో పలు కీలక సూచనలు చేసిన వక్త అన్నారు. చివరికి తాను సాధించిన తెలంగాణ కనులారా చూడకముందే తన ప్రాణాల్ని వదిలిన గొప్ప వ్యక్తి అన్నారు. ఎప్పటికీ ఎన్నటికీ జయశంకర్ సార్ ను ఎవరు కూడా మరిచిపోరని గుర్తు చేశారు. విద్యార్థులు జయశంకర్ సార్ జీవితం గురించి అధ్యయనం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాల్ లు ఉపాధ్యాయ సిబ్బంది పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News