ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మతం మారితే ఎస్సీ హోదా ఉండదని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మరోసారి సమర్పిం చింది.ఈ తీర్పును రక్షించాలని ఏపీలోని బాపట్లకు చెందిన చింతాడ ఆనంద్, వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ తీర్పులో లోపాలు లేవని రివ్యూ చేయా ల్సిన అంశాలేవి లేవని ధర్మాసనం స్పష్టం చేసింది ఈ మేరకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మార్చి 24న హైకోర్టు వెలువరించిన తీర్పు యధాతధంగా రాజాగా సుప్రీంకోర్టు అమలు చేసింది . బాపట్ల జిల్లా పిట్ల వాని పాలెం మండలం కొత్తపాలెం లో 2021 లో జరిగిన ఘటన నేపథ్యంలో చింతల ఆనంద్ పోలీసులు ఫిర్యాదు చేశారు. ప్రార్థన ముగించుకొని వెళు తున్న సమయంలో తనపై దాడి చేసి కులం పేరుతో దూషించారంటూ ఆయన ఫిర్యాదు లో పేర్కొన్నారు. దీంతో అక్కల రామి రెడ్డి,తో సహా మరో ఐదుగురు పై కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో తాను క్రైస్తవ మత స్థుడ నని పేర్కొన్న ఆనంద్ కు ఎస్సీ హోదా ఆధా రంగా అల్ట్రాసిటీ చట్టం వర్తించదని అక్కల రామిరెడ్డి, న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ కేసును విచారిం చిన హైకోర్టు ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతం స్వీక రిస్తే రాజ్యాంగపరం గా ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేస్తూ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆనంద్ కు అక్కడ కూడా ఎదురు దెబ్బ తగి లింది,హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీం ఈ తీర్పును వెలువరించింది.
Admin
E Nivas News