ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున కుడితి సాయి ప్రియా నరసింహారెడ్డి మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తాము పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. వార్డులోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని, వార్డు సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. గత పదేళ్ల కెసిఆర్ పరిపాలన, రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో తమను గెలిపిస్తే 13వ వార్డును అభివృద్ధి రంగంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.13వ వార్డు ప్రజలు తమను ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, కుడితి వెంకట్ రెడ్డి, లక్ష్మారెడ్డి, దేవరశెట్టి లక్ష్మీనారాయణ, వెంకట్ రెడ్డి, ఉప్పల సత్యం, జనార్ధన్, మధు, ప్రసాద్, లెజెండ్ పరుశురాములు, కాంగ్రెస్ పార్టీ, అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News