ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పురపాలిక ఎన్నికల్లో మంథని గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంథని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 1వ, వార్డు అభ్యర్థి కుర్ర లింగయ్య, 2వ వార్డు అభ్యర్థి నూకల కమల్, 9వ వార్డు మారుపాక నిహారిక, 13వ వార్డు ఎల్లంకి వంశీల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంథని మున్సిపల్ ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, మంథని అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే పట్టణ అభివృద్ధికి చాలా నిధులను కేటాయించామన్నారు. రానున్న రోజులలో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించుకొని మంథని అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి శ్రీధర్ బాబు కొరారు. మంత్రి వెంట నాయకులు తొట్ల తిరుపతి యాదవ్, పర్వతాలు యాదవ్, పురుషొత్తం రెడ్డి, పాపారావు, ఆయా వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News