ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ (పాత మంచిర్యాల)లోని బస్తీ దావకానలో గర్భాశయ క్యాన్సర్ (సర్వేకల్ కాన్సర్) నివారణ కోసం ఉపయోగించే హెచ్ పి వి వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా కుమార్ దీపక్,జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు లు మంగళవారం ప్రారంభించారు. అనంతరం కలెక్టర్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల ఆడపిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, స్థానిక కార్పొరేటర్ తూముల నరేష్, డాక్టర్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News