ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు మహేష్35 సంవత్సరాల వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడినట్లు ఎస్హెచ్ఓ అన్వర్ తెలిపారు. మృతుడు వృత్తిరీత్యా వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఫైనాన్సులో వ్యాన్ కొనుగోలు చేశాడు. వ్యాన్ ఈఎంఐ కట్టేందుకు కొంతమంది దగ్గర అప్పులు చేశాడు.అంతేకాకుండా ఇటీవల వ్యాన్ కుదపెట్టి కొంతమంది దగ్గర అప్పు చేయగా మరి కొంతమంది వద్ద తన ఖర్చుల నిమిత్తం సుమారు మూడు లక్షల వరకు అప్పు చేశాడు. చేతిలో వ్యాన్ లేకపోవడం తీసుకున్న కాడ అప్పుల వాళ్ళు కట్టమని అనడం వ్యాన్ లేకపోవడంతో కట్టడం ఇబ్బందిగా మారి మనస్థాపానికి గురయ్యాడన్నారు . గత మూడు రోజుల క్రితం తన భార్య అనారోగ్యంతో తల్లి వద్దకు వెళ్ళగా మృతుడు ఆదివారం కిరాయి వెళ్లి వచ్చి చేసిన అప్పులు తీర్చడం భారమై మనస్థాపం చెంది ఇంట్లో చీరతో రేకుల కింద రాడుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. మృతునికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య వనిత ఫిర్యాదు మేరకు ఎస్ హెచ్ ఓ అన్వర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Admin
E Nivas News