Tuesday, 28 July 2026 04:37:57 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య...

Date : 27 July 2026 08:40 PM Views : 131

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గుండారపు మహేష్35 సంవత్సరాల వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడినట్లు ఎస్హెచ్ఓ అన్వర్ తెలిపారు. మృతుడు వృత్తిరీత్యా వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఫైనాన్సులో వ్యాన్ కొనుగోలు చేశాడు. వ్యాన్ ఈఎంఐ కట్టేందుకు కొంతమంది దగ్గర అప్పులు చేశాడు.అంతేకాకుండా ఇటీవల వ్యాన్ కుదపెట్టి కొంతమంది దగ్గర అప్పు చేయగా మరి కొంతమంది వద్ద తన ఖర్చుల నిమిత్తం సుమారు మూడు లక్షల వరకు అప్పు చేశాడు. చేతిలో వ్యాన్ లేకపోవడం తీసుకున్న కాడ అప్పుల వాళ్ళు కట్టమని అనడం వ్యాన్ లేకపోవడంతో కట్టడం ఇబ్బందిగా మారి మనస్థాపానికి గురయ్యాడన్నారు . గత మూడు రోజుల క్రితం తన భార్య అనారోగ్యంతో తల్లి వద్దకు వెళ్ళగా మృతుడు ఆదివారం కిరాయి వెళ్లి వచ్చి చేసిన అప్పులు తీర్చడం భారమై మనస్థాపం చెంది ఇంట్లో చీరతో రేకుల కింద రాడుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపారు. మృతునికి భార్యా ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య వనిత ఫిర్యాదు మేరకు ఎస్ హెచ్ ఓ అన్వర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :