ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సీఎస్ కే రామకృష్ణారావు ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. పదవీ విరమణ తర్వాత ఆయన సీఎం రేవంత్ రెడ్డికి సలహాదారుగా నియమితులయ్యారు. అదే సమయంలో కొత్త సీఎస్గా సంజయ్ జాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో మాజీ సీఎం కేసీఆర్ కూడా పదవీ విరమణ చేసిన సీఎస్లను సలహాదారులుగా నియమించిన విషయం గమనార్హం. ఈ క్రమంలోనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
Admin
E Nivas News