Monday, 15 June 2026 04:19:37 PM
# సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం... # ఖోడాద్ గ్రామ బ్రిడ్జిని ప్రారంభించిన ఎమ్మెల్యే... # పాఠశాలల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి # పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి... # ఆలయాలను అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం... # సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి

కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క...

Date : 13 June 2026 09:06 PM Views : 40

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కార్మిక సంక్షేమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరాంపూర్ కార్మిక క్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో335 మంది కార్మికులకు కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. భవిష్యత్తులో మరిన్ని కారుణ నియామకాలు చేపడతామన్నారు కాంట్రాక్టు కార్మికులకు 5000 బోనస్ ప్రకటించామన్నారు. సింగరేణి సంస్థను అక్రమార్కుల చేతిలో పడనివ్వమన్నారు. కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని మరోసారి ఉద్ఘాటించారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సింగరేణిపై అనవసరపు ఆక్షేపణలు చేస్తున్నారు బొగ్గు నిక్షేపాల గురించి కావాలనే బురద జల్లుతున్నారన్నారు గతంలో జరిగిన ఒక కథ ఒకలని బయటకు తీస్తామన్నారు బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు సింగరేణి గత ప్రభుత్వం కూడా కుటుంబ సంస్థగా చూసిందన్నారు టెండర్లపై టిఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తుందన్నారు సింగరేణి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది అన్నారు కార్మికులకు న్యాయం చేసేందుకు మా ప్రభుత్వం ఎల్లవేళలా ముందుంటుందన్నారు. సింగరేణిలో అనుకున్న దానికంటే ఎక్కువ నియామకాలు చేపడతామని తెలిపారు లాభాల్లో కార్మికులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. ఎన్నికల కమిషన్ ను బిజెపినడిపిస్తుం దన్నారు. సింగరేణి అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు. బొగ్గునిక్షేపాల గురించి కావాలనే బురద జల్లుతున్నారు. గతంలో జరిగిన ఒక తప్పులన్నీ బయటికి చూస్తామన్నారు. బాధ్యులను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. సింగరేణి గత ప్రభుత్వం కుటుంబ సంస్థగా చూసిందని, టెండర్లపై టిఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తుందని ఆరోపించారు. సింగరేణి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కార్మికులకు న్యాయం చేసేంతవరకు మా ప్రభుత్వం ఉందన్నారు. సింగరేణిలో అనుకున్న దాని కంటే ఎక్కువ నియామకాలు చేపట్టాం లాభాల్లో కార్మికులను కూడా భాగస్వాములను చేస్తామన్నారు. హరీష అబద్దాలు మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి హరీష్ రావు మధ్య దోస్తీ ఉంది రాష్ట్రాన్ని అప్లోవ్వులేని నెట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కుట్ర రాజకీయాలు చేస్తున్నారు సింగరేణి పై ఎలాంటి గద్దలను వాళ్ళని సింగరేణి కేంద్రమే చేసిందో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. తాడిచెర్ల బ్లాక్ కేటాయింపు కేంద్రం అడ్డుకుం దని,సింగరేణి ఆదాయాన్ని ప్రైవేటుకు మళ్ళించారు 14 ఏళ్లలో 97046 కోట్ల ఆదాయం కోల్పోయాం అన్నారు . సత్తుపల్లి బ్లాక్ 3 ప్రైవేట్ కిరణతో నష్టం జరిగిందన్నారు. బొగ్గు గనుల మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని సింగరేణి బ్లాకుల కేటాయింపులకు కృషి చేయాలన్నారు. సింగరేణి ప్రయోజనాల కోసం కేంద్రం ముందుకు రావాలన్నారు. టిఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. గత పాలకులు సింగరేణి దోచుకున్నారు. మా ప్రభుత్వం దోపిడి ప్రభుత్వం కాదు. ప్రజా ప్రభుత్వం అన్నారు.

టిఆర్ఎస్ నేతలు కట్టుకథలతో బురద చల్లడం ఎంతవరకు సమంజసం అన్నారు. హరీష్ రావు అబద్ధాల రావు గా మారిపోయారు. హరీష్ రావు కిషన్ రెడ్డి లేఖలపై అనుమానం ఉందన్నారు. విష ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం జరుగుతుందన్నారు. సింగరేణికి నష్టం చేసింది బి ఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ప్రజా పాలనకు తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తూనే ఉన్నారన్నారు. బి ఆర్ఎస్, బిజెపి కుట్రలను సాగనివ్వమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్ కుమార్, మక్కాన్ సింగ్ ఠాగూర్, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు, కార్మికులు,నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :