ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : హుతాత్మ దివాస్ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మంథనిలోని కృష్ణా ల్యాబులో రక్త దానం, గ్రూప్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మంథని ప్రఖండ సహా కార్యదర్శి నామిని నాగేష్ మాట్లాడుతూ 1992 అయోధ్య మొదటి కరసేవలో అమరులైన రామ్ కొఠారి శరత్ కొఠారి సోదరుల ఆత్మ బలిదానాలని స్మరిస్తూ ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరాలు, గ్రూప్ టెస్ట్ చేపించడం జరుగుతుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ రక్తం దాతలుగా స్పందించడానికి ఎల్లప్పుడూ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భజరంగ్ దళ్ మంథని ప్రఖండ ప్రముఖ్ నరేడ్ల రాజేష్ మాట్లాడుతూ కేంద్రీయ బజరంగ్ దళ్ ఆదేశానుసారం ఈ రక్త పరీక్ష కార్యక్రమం నిర్వహించామని ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తికి సేవ చేయడమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ కార్యకర్తలు భోగే సందీప్, తాటి రాము, ఉడుత రాంబాబు, చింతకింది చరణ్, మిట్టపల్లి రోహిత్, అట్టం చిన్నా, బొడ్డు కుమార్ ,పంకజ్ లు పాల్గొన్నారు.
Admin
E Nivas News