ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం విద్యా వారోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. మహాత్మా సంతోష్ అధ్యక్షతలో స్థానిక మున్సిపల్ చైర్మన్ అంజలి నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని విద్యా వారోత్సవాలు ప్రారంభించారు.ఈ సందర్భంగా కళాశాల అడ్మిషన్ పోస్టర్, ఉచిత పీజీ తెలుగు కోచింగ్ పోస్టర్ లను ఆవిష్కరించారు. వారం ప్రణాళికను ప్రకటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ప్రతి పౌరుడు ప్రతి సంస్థ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వం సంక్షేమ ఫలాలను యువత ప్రచారం చేసి పేదలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ మహాత్మా సంతోష్ మాట్లాడుతూ ప్రభుత్వం కళాశాలల్లో విద్యార్థులు మంచి ప్రగతి సాధిస్తున్నారని, వారం రోజుల కార్యక్రమ ప్రణాళికలో కళాశాలలో సాధించిన విజయాలు నివేదికగా తయారు చేస్తామని రోజువారీ ప్రదర్శనల ద్వారా అధ్యాపకులూ విద్యార్ధులు ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బందిస్థానిక ప్రజా ప్రతినిధులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆరిఫ్, కౌన్సిలర్లు పెండెం రాజు,చంద్రమౌళి, కో ఆప్షన్ మెంబర్ థైసిన్, ఎల్లారం సర్పంచ్ గొ డిసెల రాజేశం,కళాశాల అధ్యాపకులు సంతోష్ కుమార్, శంకరయ్య, ప్రేమలత, తిరుపతి, సురేష్, లైబ్రేరియన్ నాగేశ్వర్, శ్రీనివాస్ సంధ్యారాణి, కవిత, మల్లయ్య, రాజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, మహేష్, సతీష్, స్వామి రాజేశం, శ్రీనివాస్, నిషాoత్ విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News