ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో జపాన్ షిటోరియు సికోకాయ్ మంథని విద్యార్థులు కథ, కుమితే విభాగాల్లో ఆత్యంత ప్రతిభ కనబరిచి బంగారు, వెండి పథకాలు సాధించారు. ఈ పోటీల్లో కరాటే శిక్షకులు కావేటిసమ్మయ్య ఆధ్వర్యంలో జపాన్ షిటోరియు శికో కాయ్ కరాటే ఇంటర్నేషనల్ అకాడమీకి చెందిన మంథని విద్యార్థినీ విద్యార్థులు ఎండి తహసీన్ తైభ, మారేడు కొండ రిషి, మాచర్ల శివ, మారేడు కొండ నిహారిక, ఎలా వేనా నిషిత్ లు బంగారు పథకాలు సాధించగా బొగ్గుల మనోజ్ఞ, జడగాల సహస్ర, జడగాల మనస్విలు వెండి పథకాలు సాధించారు. పథకాలు సాధించిన వారిని షిటోరియు సికో కాయి, కియో ఇండియా అధ్యక్షులు పి భరత్ శర్మ, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ షిటోరియు షికో కాయి కరాటే రిప్రజెంటివ్ పాలకుర్తి పాపయ్య, తెలంగాణ కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఇప్ప శ్రీనివాస్, మల్యాల రామస్వామి, ఇన్స్ట్రక్టర్స్ నాగేల్లి రాకేష్, జడగల శివాని, కావేటి శివ, గణేష్, కే విష్ణు, హర్షవర్ధన్, మెట్టు హాసిని, గేయ శ్రీ రామ్ తేజ, శ్రీ రాములు అభినందించారు.
Admin
E Nivas News