Tuesday, 28 July 2026 11:36:20 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

చిన్న గూడూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక పర్యటన.

Date : 23 October 2025 05:53 PM Views : 302

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / చిన్న గూడూరు : గురువారం జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ చిన్న గూడూరు కె.జి.బి.వి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్ వాడీ సెంటర్ ను, ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా కె.జి.బి.వి, జిల్లా పరిషత్ పాఠశాలలను పరిశీలించి, విద్యార్థుల సంఖ్య, పనిచేస్తున్న ఉపాద్యాయుల వివరాలను ప్రిన్సిపాల్ ను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను, కిచెన్ షెడ్, స్టోర్ రూంను పరిశీలించి వంట సరుకుల నాణ్యతను పరిశీలించారు. తాజా కూరగాయలను మాత్రమే వాడాలని, అన్ని సరుకులు తగు పరిమాణం లో ఉండాలని సూచించారు. మెనూ ప్రకారం భోజన తయారీ ఉండాలన్నారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను, పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన పరిశుభ్రమమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. ఉపాద్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన ఉండాలని, విద్యార్థుల యొక్క సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని అన్నారు. పాట్యాంశాలలోని పలు అంశాలపై ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు. అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లల హాజరు, నమోదు, గర్భిణీ, బాలింతల సంఖ్య వంటి వివరాలను అంగన్వాడీ టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు వడ్డించే భోజనం పరిశుభ్రంగా ఉండాలని, చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు.అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలు, నిలువ చేసే ఫ్రీజర్స్, వ్యాక్సిన్ నిల్వ పద్దతులను పరిశీలించి తగు సూచనలు చేశారు. మందుల రికార్డులను పరిశీలించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట పాటశాల ప్రిన్సిపాల్, ఉపాద్యాయులు, అంగన్ వాడీ సిబ్బంది, పి.హెచ్.సి వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు .

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: