Tuesday, 28 July 2026 07:20:03 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

జహంగీర్ పీర్ దర్గాలో సందల్ (గంధం) ఉత్సవాలు...

సందల్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Date : 16 January 2026 10:44 PM Views : 183

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ చీఫ్ బ్యూరో జనవరి 16 :- షాద్ నగర్ కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామ పరిధిలోని జహంగీర్ పీర్ దర్గాలో మూడు రోజుల పాటు జరిగే ఉర్సు ఉత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం సందల్ (గంధం) కార్యక్రమం నిర్వహించారు. గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభమైన గంధం కార్యక్రమాన్ని దర్గాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సందల్ (గంధం) కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మా వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చందు తిరుపతి రెడ్డి, నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఆగిరు రవికుమార్, లింగారెడ్డి గూడా ఉపసర్పంచ్ అశోక్, ఖాదర్ మరియు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం జరిగే ఈ గంధం ఉత్సవాలలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి ముస్లింలు విచ్చేసి ఈ గంధం ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం నేటి సాయంత్రం నుండి ప్రారంభమై శుక్రవారం ఉదయం వరకు వివిధ కార్యక్రమాలతో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనం రావడం విశేషం అయితే ఈ సందల్ కార్యక్రమానికి ముందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ గంధం కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే శంకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఉర్సు కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అలాగే దర్గాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వచ్చే వాహనాలను నియంత్రించడానికి ఎక్కడికక్కడ పార్కింగ్ సౌకర్యాలను మెరుపు పరచాలని సూచించారు. ముఖ్యంగా ఈ రోడ్డు గుండా భారీ వాహనాలను అనుమతించరాదని ఆదేశించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉర్సు ఉత్సవ కార్యక్రమాలలొ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పట్టిష్టమైన బంధబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు ఎక్కడికక్కడ సూచనలు చేస్తూ షాద్నగర్ డిసిపి శిరీష, ఏసిపి లక్ష్మీనారాయణ, మరియు కొత్తూరు సీఐ నర్సయ్య, జేపీ దర్గా సూపరిండెంట్ ఎండి. సత్తార్ పర్యవేక్షిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: