ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ చీఫ్ బ్యూరో జనవరి 16 :- షాద్ నగర్ కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామ పరిధిలోని జహంగీర్ పీర్ దర్గాలో మూడు రోజుల పాటు జరిగే ఉర్సు ఉత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం సందల్ (గంధం) కార్యక్రమం నిర్వహించారు. గురువారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభమైన గంధం కార్యక్రమాన్ని దర్గాలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సందల్ (గంధం) కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మా వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చందు తిరుపతి రెడ్డి, నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఆగిరు రవికుమార్, లింగారెడ్డి గూడా ఉపసర్పంచ్ అశోక్, ఖాదర్ మరియు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ పాల్గొన్నారు ప్రతి సంవత్సరం జరిగే ఈ గంధం ఉత్సవాలలో పాల్గొనడానికి తెలంగాణ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి ముస్లింలు విచ్చేసి ఈ గంధం ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం నేటి సాయంత్రం నుండి ప్రారంభమై శుక్రవారం ఉదయం వరకు వివిధ కార్యక్రమాలతో ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో జనం రావడం విశేషం అయితే ఈ సందల్ కార్యక్రమానికి ముందు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. ఈ గంధం కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే శంకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే ఉర్సు కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అలాగే దర్గాలో తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని వచ్చే వాహనాలను నియంత్రించడానికి ఎక్కడికక్కడ పార్కింగ్ సౌకర్యాలను మెరుపు పరచాలని సూచించారు. ముఖ్యంగా ఈ రోడ్డు గుండా భారీ వాహనాలను అనుమతించరాదని ఆదేశించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉర్సు ఉత్సవ కార్యక్రమాలలొ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పట్టిష్టమైన బంధబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులకు ఎక్కడికక్కడ సూచనలు చేస్తూ షాద్నగర్ డిసిపి శిరీష, ఏసిపి లక్ష్మీనారాయణ, మరియు కొత్తూరు సీఐ నర్సయ్య, జేపీ దర్గా సూపరిండెంట్ ఎండి. సత్తార్ పర్యవేక్షిస్తున్నారు.
Admin
E Nivas News