Tuesday, 28 July 2026 06:13:26 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

*'మను చరిత్ర' ఒక చరిత్ర కాదు..మనిషి అంతరంగ యాత్ర*

Date : 22 January 2026 11:42 AM Views : 491

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రబంధ సాహిత్యంలో మను చరిత్రకు ఉన్న స్థానం అపూర్వమైనది. మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ కథను మహాకవి అల్లసాని పెద్దన తన వర్ణనా వైభవంతో మహాప్రబంధంగా మలిచారు. కవి ప్రతిభకు, కృతి భర్తగా శ్రీకృష్ణదేవరాయలు ఆశ్రయానికి ఈ కావ్యం అజరామర కీర్తిని తెచ్చింది. ఈ కావ్యం స్వారోచిష మను సంభవాన్ని నేపథ్యంగా తీసుకొని,ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఒక్కటి ప్రవరుడు, రెండు సిద్ధుడు, మూడు వరూధిని ఈ పాత్రలతో కథ నడుస్తుంది. *ప్రవరుడు ఆదర్శ జీవి* ప్రవరుడు ఒక ఆదర్శ గృహస్థుడు. తల్లిదండ్రుల సేవలో తరించేవాడు. నిత్యాగ్నిహోత్ర పరాయణుడు. అతిథి సేవను ధర్మంగా భావించేవాడు. అరుణాస్పద పట్టణాన్ని ఎప్పుడూ విడిచిపెట్టని నియమవంతుడు. తీర్థయాత్రల కథలు, హిమాలయ సౌందర్య వర్ణనలు అతని అంతరంగంలో కోరికగా మారాయి. అదే సమయంలో అతని ధర్మనిష్ఠ అతడిని ఊరు విడిచి వెళ్లకుండా కట్టడి చేసింది. *సిద్ధుని ఆగమనం* ఒకనాడు అతిథిగా వచ్చిన సిద్ధుడు తన యాత్రల విశేషాలు చెబుతాడు. చిన్న వయసులోనే ఇన్ని ప్రదేశాలు ఎలా చూశావని ప్రవరుడు అడిగితే, తన వద్ద ఉన్న దివ్య పసరు మహిమను వివరిస్తాడు. కుతూహలంతో నిండిన ప్రవరుడు ఆ పసరును తనకు ఇవ్వమని కోరతాడు. సిద్ధుడు పసరును అతని పాదాలకు పూసి వెళ్లిపోతాడు. కానీ దాని పరిమితి గురించి చెప్పడు. *హిమాలయ యాత్ర* పసరు ప్రభావంతో ప్రవరుడు హిమాలయాలకు చేరతాడు. ప్రకృతి సౌందర్యంలో పరవశిస్తాడు. కానీ మంచు తాకడంతో పసరు కరిగిపోతుంది. తిరిగి వెళ్లలేని అయోమయ స్థితిలో ఉండగా ఒక లోయలో అపూర్వ సౌందర్యరాశి వరూధిని దర్శనమిస్తుంది. *అంతర్మథనం.....ధర్మ విజయం* వరూధిని, ప్రవరుల సంవాదంలో వరూధిని అప్సరస వంశానికి చెందిన స్త్రీ తన అందంతో, వాక్చాతుర్యంతో ప్రవరుణ్ని మోహింపజేయాలని ప్రయత్నిస్తుంది. "మీ యజ్ఞ యాగాల ఫలితం స్వర్గంలో మా కౌగిళ్లలోనే కదా! ఆ సుఖాన్ని ఇప్పుడే ఎందుకు అనుభవించరు?" అని ప్రలోభపెడుతుంది. కానీ ప్రవరుడు కామశాస్త్రం తెలిసినవాడే. శృంగారాన్ని తిరస్కరించేవాడు కాదు. అయినా ఏకపత్నీ వ్రతానికి కట్టుబడినవాడు, ధర్మం వైపు నిలుస్తాడు. అంతఃసంఘర్షణ ఇది కేవలం బాహ్య సంఘటన కాదు. ఇది మనసులో జరిగే ఘర్షణ కోరిక, వివేకం, భోగం, ధర్మం. వరూధిని అతని అంతశ్చేతనలో దాగి ఉన్న భోగవాంఛకు ప్రతిరూపం. *వివేక విజయం* వరూధిని అతన్ని కౌగిలించుకున్న క్షణమే ప్రవరుడు ఉలిక్కి పడి "హా శ్రీహరీ"! అంటూ ఆమెను దూరం నెట్టివేస్తాడు. తన కోరికలను అగ్నిలో వేసి, యోగాగ్నితో శుద్ధి చేసుకొని, అగ్ని సహాయంతో తన గృహానికి చేరుకుంటాడు. *కావ్య సందేశం* మను చరిత్ర మనకు చెప్పేది ఇదే. కోరికలను గెలవడం కాదు, జయించాలి. ధర్మం తాత్కాలికంగా కాదు, సర్వకాలికం. గృహస్థ ధర్మమే, సమాజానికి మూలస్తంభం. గెలుపు అశాశ్వతం, విజయం శాశ్వతం. అందుకే మను చరిత్ర ఒక కథ కాదు, మనిషి అంతరంగ యాత్ర. --డా.ఓర్సు రాయలింగు 9849446027

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: