ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అన్ని అనుమతులతో మున్సిపల్ నిబంధనల ప్రకారం నిర్మించిన తన ఇంటిని కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ కుర్ర సారక్క జాతీయ షెడ్యుల్డ్ ట్రైబ్ నేషనల్ కమిషన్ మెంబర్ కు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని 314 సర్వే నంబర్ లోని 244 గజాల విస్తీర్ణం లో నిబంధనల మేరకు మున్సిపల్ అనుమతితో ఇంటి నిర్మాణం చేసుకున్నామన్నారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ తన ఇంటి నిర్మాణం కూల్చి వేస్తున్నట్లు షోకాజు నోటీసులు, ఇంటిని కూల్చివేసే ఆర్డర్ కాపీ జత చేసి తనకు ఇచ్చి బలవంతంగా తనతో సంతకం తీసుకున్నారని ఆరోపించారు. నా వద్ద హై కోర్ట్ ఉత్తర్వులు వున్నాయని చెప్పినా వినకుండా తమ వద్ద నుడి ఫోన్లు లాక్కొని మంథని పోలిస్ స్టేషన్ కి తరలించి ఇంటిని కూల్చివేసి మా కుటుంబ సభ్యుల్ని నిరాశ్రయుల్ని చేసిన అధికారులపై చర్యలు తీసుకొని తమకు నష్టం జరిగిన సుమారు 1 కోటి 35 లక్షల పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు.
Admin
E Nivas News