ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం వెంకట్రావు పేట గ్రామం అటవీ శాఖ ఆధ్వర్యంలో విభిన్న జాతుల పక్షులకు విడిది కేంద్రంగా మారిన వెంకట్రావుపేట ఊర చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది.. అందులో భాగంగా వెంకట్రావుపేట ను ఎకో టూరిజం బర్డ్స్ పార్క్ గా గుర్తించి పనులను త్వరలోనే ప్రారంభిస్తుందని సమాచారం. దీని ద్వారా వెంకట్రావుపేట భవిష్యత్తు కాలంలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయని ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువును డిస్టర్బ్ చేయకుండా మన గ్రామ రజకుల కోసo అధునాతన వసతులతో దోబిగాట్ మరియు సోలార్ పంప్ సెట్టు చెరువు యొక్క పూర్తి విస్తీర్ణానికి హద్దుల ఏర్పాటు ఎఫ్ టి ఎల్ నిర్ధారణ చెరువు కట్ట వెడల్పు మరియు రోడ్డు వాచ్ టవర్, వ్యూ పాయింట్ నిర్మాణం ఆర్టిఫిషియల్ ఐలాండ్ నిర్మాణం చెరువులో పర్యాటకుల కోసం బోటింగ్ ఏర్పాటు చేయనున్నారు. చెరువు కట్ట సుందరీ కరణ చెరువులోని పూడికతీత గుర్రపు డెక్కల తొలగింపు తూముల పునర్ నిర్మాణం వంటి వసతులతో పాటు ఇంకా ఎన్నెన్నో సదుపాయాలు మన గ్రామానికి రానున్నాయి. విషయం తెలియ చేసిన వెంటనే వెంకట్రావు పేట గ్రామ ప్రజల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
Admin
E Nivas News